BigTV English

IPL 2025 Playoffs: IPL మ్యాచులకు ఎక్స్‌ట్రా టైం పెంపు…ఇక రాత్రి 1:15 గంటల వరకు

IPL 2025 Playoffs: IPL మ్యాచులకు ఎక్స్‌ట్రా టైం పెంపు…ఇక రాత్రి 1:15 గంటల వరకు

IPL 2025 Playoffs:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( IPL 2025 ) తుది దశకు వచ్చింది. ఇక ప్లే ఆఫ్ మ్యాచులు అలాగే… నాకౌట్ మ్యాచ్లు జరగనున్నాయి. ఇప్పటికే మూడు జట్లు అధికారికంగా ప్లే ఆఫ్ కు చేరిపోయాయి. మరో జట్టు ప్లే ఆఫ్ కు చేరితే… రసవత్తర పోరు ప్రారంభమవుతుంది. ఇవాళ ముంబై ఇండియన్స్ ( Mimbai indians) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals) మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్ ఆశలు ఎక్కువగా ఉంటాయి. ముంబై గనుక గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్ వెళ్తుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో.. భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది.


Also Read: Abhishek vs Digvesh: నీకు 10.. నాకు 10 అంటూ పంచాయితీ తెంపిన BCCI VP రాజీవ్ శుక్లా

ఐపీఎల్ మ్యాచ్ ల సమయం పొడిగింపు


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఐపీఎల్ టోర్నమెంటులో జరగబోయేవి అన్ని కీలక మ్యాచ్లే. అందుకే ఐపీఎల్ లో ఉండే అదనపు సమయాన్ని మరో గంట తొలగించనున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అంటే అర్ధరాత్రి 1:15 గంటల వరకు ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయి. అయితే ఈ నాకౌట్ మ్యాచుల వరకే ఈ సమయం పెంపు ఉంటుందని చెబుతున్నారు.

మొన్నటి వరకు అదనంగా 60 నిమిషాల పాటు సమయం ఉండేది. అంటే ఒక గంట పాటు ఉండేది. ఇకపై నుంచి ఈ సమయం 120 నిమిషాలకు పొడిగించనున్నారు. అంటే రెండు గంటల పాటు పెంచేశారు భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రతినిధులు. ఇకనుంచి ప్రతి మ్యాచ్ కు ఇదే నియమం ఉంటుంది. ప్రస్తుత సమయంలో ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి. దేశంలోని ఏ ప్రాంతమైన వర్షాలు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే వర్షాలు పడ్డ కూడా మ్యాచ్ ఫలితంలో తేడా ఉండకూడదని… మ్యాచ్ సమయాన్ని పెంచేశారు. అప్పుడు కచ్చితంగా ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా ఆడవచ్చు. అలా ఆడితే రిజల్ట్ కచ్చితంగా ఉంటుంది. ఇరుజట్లకు న్యాయం జరుగుతుంది. వర్షం పడింది కదా… అని చెరో పాయింట్ ఇవ్వడం… లేదా డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఏదో ఒక జట్టుకు విజయాన్ని ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదని క్రీడా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే ఐపిఎల్ టోర్నమెంట్ 2025లో సమయాన్ని పెంచారు.

Also Read: Sanjiv Goenka : 27 కోట్లు బొక్క… చేసేదేమీ లేక పంత్ కు మసాజ్ చేస్తున్న లక్నో ఓనర్

జూన్ 3న ఫైనల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఈనెల 17వ తేదీన పునః ప్రారంభమైన సంగతి తెలిసిందే. జూన్ మూడవ తేదీ వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది. జూన్ మూడవ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియమా?: లేదా కోల్కత్తా ఈడెన్ గార్డెన్స్ ఆ?అన్నది.. తేలాల్సి ఉంది.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×