E-Paper
Advertisement

Ind vs Eng, 5th T20I: నేడే చివరి టీ20…భారీ మార్పులతో టీమిండియా..షమీకి నిరాశే !

Ind vs Eng, 5th T20I: నేడే చివరి టీ20…భారీ మార్పులతో టీమిండియా..షమీకి నిరాశే !
Advertisement

Ind vs Eng, 5th T20I: ఇవాళ టీమిండియా ( Team India ) వర్సెస్‌ ఇంగ్లాండ్‌  ( England ) జట్ల మధ్య చిట్ట చివరి టీ20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మేరకు రంగం సిద్ధం అయింది. టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఐదవ టి20 మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియం ( Wankhede Stadium ) వేదికగా జరగనుంది. ఇవాళ సాయంత్రం 7:00 సమయంలో… ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మొదటి టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు.. నిపుణులు చెబుతున్నారు. బ్యాటింగ్ చేసిన జట్టు మొదట విజయం సాధించే ఛాన్స్ ఉంది.

Also Read: Rohit Sharma: పాస్ పోర్ట్ మర్చిపోయా…తన మతిమరుపుపై రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!

Advertisement

అయితే ముంబైలోని వాంఖడే స్టేడియం లో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో…. టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ముగ్గురు రాణిస్తారని.. అంచనా వేస్తున్నారు. ఈ ముగ్గురికి ముంబై ( Mumbai )హోం గ్రౌండ్ కావడంతో… ఈ ముగ్గురు ప్లేయర్లు దుమ్ము లేపుతారని అంటున్నారు. ఐపీఎల్ లో ఈ ముగ్గురు ప్లేయర్లు ముంబైకి ఆడుతున్నారు. అందుకే వీరిపై అందరూ నమ్మకం ఉంచుతున్నారు.  అటు సూర్య కుమార్ యాదవ్ కూడా ఈ మ్యాచ్ లోనైనా ఫాంలోకి రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

కాగా… నాలుగో టీ20లో 15 పరుగుల తేడాతో నిర్ణయాత్మక విజయాన్ని అందుకుంది టీమిండియా. ఈ తరుణంలోనే… ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. దీంతో తిరుగులేని 3-1 ఆధిక్యంలో నిలిచింది టీమిండియా. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా అలాగే… శివమ్ దూబే ఒక్కొక్కరు 53 పరుగులతో గణనీయమైన సహకారాన్ని టీమిండియాకు అందించారు. దీంతో… నాలుగో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో… ఇంగ్లాండ్‌ పోరాడి ఓడింది. 19.4 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది ఇంగ్లండ్. దీంతో నాలుగో టీ20లో 15 పరుగుల తేడాతో నిర్ణయాత్మక విజయాన్ని అందుకుంది టీమిండియా. ఈ మ్యాచ్‌ లో బెన్ డకెట్ 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శివమ్ దూబే స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగిన హర్షిత్ రాణా 33 పరుగులకు మూడు ముఖ్యమైన వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు.

Advertisement

 

Also Read: Chaiwala Dolly: ఏంట్రా ఇది… గ్రౌండ్ లోనే చాయ్ అమ్ముతున్న టీ మాస్టర్?

అంచనా వేసిన ప్లేయింగ్ XIలు

టీమిండియా: సంజూ శాంసన్( WC), అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ ©, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా

ఇంగ్లాండ్: ఫిల్ సాల్ట్(wk), బెన్ డకెట్, జోస్ బట్లర్ ©, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×