E-Paper
Advertisement

22A అంశం పై సమీక్ష.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి!

22A అంశం పై సమీక్ష.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి!
Advertisement

CM Revanth Reddy: రాష్టంలో 22A అంశం పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రజలు పుకార్లు.. కట్టుకథలు నమ్మవద్దని సీఎం రేవంత్ తెలిపారు. ప్రజలు తమ భూమి హక్కు విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దళారులు. మీడిటర్స్ ని ఆశ్రయించవద్దు అని సీఎం స్పష్టం చేశారు.

22-ఏ నిషేధిత భూములు..

22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేష‌న్ల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర ఉన్నతాధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు ఉండ‌కుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు.

Advertisement

Also Read: కూతురి స్విమ్మింగ్ కోచ్ పై తల్లికి అలాంటి కోరిక… చివరికి ఏం జరిగిందో చూస్తే బుర్రపాడు

త‌ప్పులు లేకుండా..

రిజిస్ట్రేష‌న్ల కోసం ఆన్‌లైన్‌లో స్లాట్ తీసుకొన్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే, రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లో ప‌రిశీలించి, అది ప్రైవేటు భూమి అయితే రిజిస్ట్రేష‌న్ వెంట‌నే చేస్తారన్నారు. జిల్లా క‌లెక్టర్లు 22-ఏ జాబితా భూములను క్షుణ్ణంగా ప‌రిశీలించి, శాశ్వ‌త ప‌రిష్కారానికి స‌రైన జాబితాను రూపొందిస్తారని సీఎం స్పష్టం చేశారు. అందులో ఎలాంటి త‌ప్పులు లేకుండా చూడాల‌ని ఆదేశించారు.

ఇబ్బంది రానివ్వం..

Advertisement

ఈ ప్ర‌క్రియ‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని సీఎం ఆదేశించారు. ప్రజ‌లు త‌మ భూ హ‌క్కుల విష‌యంలో ఎటువంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేదని, ప్రజ‌ల ఆస్తి హ‌క్కుల ప‌రిర‌క్షణ‌కు రాష్ట్ర ప్రభుత్వం క‌ట్టుబ‌డి ఉందని స్ఫష్టం చేశారు. ప్రైవేటు భూముల‌కు సంబంధించి ఒక్క అంగుళం భూమికి కూడా ఇబ్బంది రానివ్వం అని, 22-ఏ భూముల విష‌యంలో ద‌ళారులు, మ‌ధ్యవ‌ర్తుల‌ను ఆశ్రయించ‌వ‌ద్దని సీఎం తెలిపారు. ఎటువంటి పుకార్లు, క‌ట్టు క‌థ‌ల‌ను విశ్వసించ‌వ‌ద్దని అన్నారు.

Also Read: ముగ్గురు సభ్యులుంటే.. ఇద్దరికే రేషన్ బియ్యం!

Tags

Related News

ముగ్గురు సభ్యులుంటే.. ఇద్దరికే రేషన్ బియ్యం!

సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేపై బండి సంజయ్ ఫైర్!

పెద్ది విగ్రహం తొలగిస్తారా? అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్!

మీ తాటాకు చప్పుళ్లకు భయపడను.. దమ్ముంటే ఆధారాలు చూపించు.. మంత్రి పొంగులేటి ఫైర్!

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ చేసిన సీఎం రేవంత్ రెడ్డి!

22A జాబితాపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు

సర్ పై నిప్పులు చెరిగిన పీసీసీ మహేష్ కుమార్ గౌడ్.. ప్రశ్నార్థకంగా 92 లక్షల ఓట్లు!

Big Stories

Advertisement
×