E-Paper
Advertisement

Hyderabad News: తిరుపతి, హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదాలు.. ఓ రబ్బర్ కంపెనీలో ఎగిసిపడిన మంటలు

Hyderabad News: తిరుపతి, హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదాలు.. ఓ రబ్బర్ కంపెనీలో ఎగిసిపడిన మంటలు
Advertisement

Hyderabad News: హైదరాబాద్‌ కాటేదాన్ పారిశ్రామికవాడలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో తిరుపతి రబ్బర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్నవి రబ్బర్ ఉత్పత్తులు కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. అదే సమయంలో ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగలు కమ్మేశాయి.

సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. మంటలు అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. పొగ కారణంగా స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఆస్తినష్టం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.

Advertisement

ప్రస్తుతానికి మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రమాదానికి సంబంధించి కారణాలు ఇంకా తెలియాల్సివుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయి.

నాలుగురోజుల కిందట పటాన్‌చెరులోని పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచి ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన నుంచి ఇప్పుడిప్పుడే నగరవాసులు తేరుకుంటున్నారు. ఈలోగా కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అక్కడికి చేరుకున్నట్లు సమాచారం.

Advertisement

ALSO READ: కేసీఆర్ మా నాయకుడు, కేటీఆర్‌తో మాటల్లేవ్, కవిత సంచలన కామెంట్స్

తిరుపతి భారీ అగ్నిప్రమాదం

మరోవైపు తిరుపతి పట్టణంలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆలయం ముందు ఉన్న షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చలువ పందిళ్లకు మంటలు అంటుకోవడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు.

ప్రస్తుతానికి మంటలను అదుపులోకి తెచ్చినట్టు తెలుస్తోంది. ఆలయ రథాన్ని సురక్షితంగా తరలించినట్లు  చెబుతున్నారు టీటీడీ అధికారులు. ఆరు దుకాణాలు, 10 ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు సమాచారం.  అయితే ఆస్తినష్టం భారీ ఉండవచ్చని భావిస్తున్నారు అధికారులు. ఇత్తడి సామాన్లు, బొమ్మలు దగ్ధమయ్యాయి.

గతంలో గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని దుకాణాలు తగలబడ్డాయి. అప్పుడూ భారీ నష్టం వాటిల్లింది. అయితే విద్యుత్ వైర్లు కారణంగానే ఆ ప్రాంతంలో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

 

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×