E-Paper
Advertisement

Richest Railway Station: దేశంలో రిచెస్ట్ రైల్వే స్టేషన్ ఇదే, టాప్ 5లో తెలుగు స్టేషన్ కూడా..

Richest Railway Station: దేశంలో రిచెస్ట్ రైల్వే స్టేషన్ ఇదే, టాప్ 5లో తెలుగు స్టేషన్ కూడా..
Advertisement

India’s Highest Earing Railway Stations: ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అమెరికా, చైనా, రష్యా తర్వాత స్థానంలో ఇండియన్ రైల్వే ఉంది. దేశ వ్యాప్తంగా సుమారు లక్ష కిలో మీటర్ల మేర రైల్వే లైన్లు ఉన్నాయి. నిత్యం 22 వేలకు పైగా రైళ్లు సేవలను అందిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 7,308 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇక భారతీయ రైల్వే సంస్థకు టికెట్ల అమ్మకంతో పాటు సరుకు రవాణా ద్వారా భారీగా ఆదాయం పొందుతోంది. రైల్వే స్టేషన్ల ద్వారా కూడా పెద్ద మొత్తంలో ఆదాయం లభిస్తున్నది. రైల్వే స్టేషన్లలోని షాపులు, యాడ్స్, ఫ్లాట్ ఫారమ్ టికెట్స్, క్లాక్ రూమ్ లు, వెయిటింగ్ హాళ్ల ద్వారా ఆదాయం పొందుతోంది. అయితే, దేశ వ్యాప్తంగా అత్యధిక ఆదాయం పొందే రైల్వే స్టేషన్ ఏదో ఇప్పుడు తెలుసుకుందాం..

దేశంలో ఎక్కువ ఆదాయాన్ని పొందే రైల్వే స్టేషన్లు

Advertisement

1.న్యూఢిల్లీ రైల్వే స్టేషన్

దేశంలో అత్యధిక ఆదాయం సంపాదించే రైల్వే స్టేషన్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. 2023-24 ఆర్థిక సంసవత్సరంలో ఈ స్టేషన్ ఏకంగా ఈ రైల్వే స్టేషన్ రూ. 3,337 కోట్లు సంపాదించింది. రైల్వేశాఖ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఆదాయంతో పాటు అధిక రద్దీ ఉన్న స్టేషన్లలోనూ ఈ స్టేషన్ తొలి స్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇక్కడి నుంచి 39,362,272  మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగించారు.

Advertisement

2.హౌరా రైల్వే స్టేషన్

అత్యధిక ఆదాయం సంపాదించే రెండో రైల్వే స్టేషన్ గా బెంగాల్ లోని హౌరా రైల్వే స్టేషన్ గుర్తింపు తెచ్చుకుంది. గత ఆర్ధిక సంవత్సరంలో ఈ రైల్వే స్టేషన్ రూ. 1,692 కోట్లు ఆదాయాన్ని సంపాదించింది. అత్యధిక రద్దీ ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. 2023-24లో ఈ రైల్వే స్టేషన్ నుంచి ఏకంగా 61,329,319 మంది ప్రయాణీకులు జర్నీ చేశారు.

3.చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్

చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ దేశంలో అత్యధిక ఆదాయం పొందే రైల్వే స్టేషన్లలో మూడో స్థానంలో నిలిచింది. ఈ రైల్వే స్టేషన్ గత ఏడాది రూ.1,299 కోట్లు సంపాదించింది. ఈ స్టేషన్ నుంచి 30,599,837 మంది రాకపోకలు సాగించారు.

4.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్   

అత్యధిక ఆదాయం సంపాదించే రైల్వే స్టేషన్లలో తెలంగాణ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాలుగో స్థానంలో నిలిచింది.  2023-24లో ఈ రైల్వే స్టేషన్ రూ. 1,276 ఆదాయాన్ని అందుకుంది. ఇక్కడి నుంచి ఏకంగా 27,776,937 కోట్ల మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగించారు.

Read Also: స్టీమ్.. డీజిల్.. ఎలక్ట్రిక్.. వీటిలో ఏ రైల్ ఇంజిన్ వేగం ఎక్కువ, ఎంత స్పీడుతో దూసుకెళ్తాయ్?

5.నిజాముద్దీన్ రైల్వే స్టేషన్

ఎక్కువ ఆదాయం పొందే ఐదో రైల్వే స్టేషన్ గా ఢిల్లీలోని హర్జత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,227 కోట్లు సంపాదించింది. ఇక్కడి నుంచి 14,537,687 మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగించినట్లు రైల్వే లెక్కలు వెల్లడిస్తున్నాయి.

Read Also: ఫారిన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇక హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్లొచ్చు!

Tags

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×