BigTV English
Advertisement

Chhattisgarh Naxal Attack: మావోయిస్టుల అరాచకం.. 10 మంది జవాన్లు మృతి

Chhattisgarh Naxal Attack: మావోయిస్టుల అరాచకం.. 10 మంది జవాన్లు మృతి

Chhattisgarh Naxal Attack: ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు.  బీజాపూర్ జిల్లాలో కుట్రూ ఖేద్రే రహదారిలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీ బాంబుతో పేల్చి వేయడంతో 10 మంది జవాన్లు మృతిచెందారు.


మొత్తం వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నారు. అందులో 10 మంది మృతచెందగా.. మరో ఐదుగురు జవాన్లుకు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు సంఘటనా స్థలంకు చేరుకొని గాయపడిన జవాన్లను బీజాపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చనిపోయిన పది మందిలో తొమ్మిది మంది దంతెవాడ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు, ఒక డ్రైవర్ ఉన్నారు. దంతేవాడ, నారాయణపూర్ – బీజాపూర్ జిల్లాల నుంచి DRG బృందాలు పాల్గొన్న జాయింట్ ఆపరేషన్ తర్వాత సిబ్బంది తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. తిరిగి వస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.


అబూజ్ మడ్ ఏరియాలో మావోయిస్టుల ఏరి వేత కోసం గత నాలుగు రోజులుగా కూంబింగ్ కొనసాగుతుంది. కూంబింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో మావోయిస్టులు పక్కా ప్లాన్‌తో మందుపాతరతో దాడి చేశారు. గత మూడు రోజులు బట్టి బీజాపూర్ సుక్మా దంతివాడ కాంకేర్ జిల్లాలకు సంబంధించిన భద్రతా బలగాలు అదే ఏరియాలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన అబూజ్ మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మృతి చెందారు.

Also Read: Jobs in Canara Bank: సువర్ణవకాశం.. కెనెరా బ్యాంకులో జాబ్స్.. రూ.27లక్షల వరకు జీతం..

ఇటీవల కాలంలో సైనికులు ఇంత పెద్ద సంఖ్యలో చనిపోవడం ఇదే కావటంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది. గత ఏడాది పోలీసుల చేతుల్లో సుమారు 260 మంది మావోయిస్టులు వరకు కూడా చనిపోయారు. ఇటీవల కాలంలో జవాన్లపై ఇంత భారీ ఘటన చోటుచేసుకోలేదు. దీంతో బీజాపూర్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టుల దారుణ ఘటనల వల్ల పోలీస్ అధికారులు, భద్రతా బలగాలు జాగ్రత్తగా ఉండాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

Related News

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Bihar Assembly Election 2025: బీహార్‌ తొలి విడత పోలింగ్‌.. 121 స్థానాలకు బరిలో 1,314 మంది

Delhi Air Pollution: వాయు కాలుష్యంతో దిల్లీ ఉక్కిరిబిక్కిరి.. సాయం చేసేందుకు ముందుకొచ్చిన చైనా

TVK Vijay: ఒంటరిగానే బరిలోకి టీవీకే.. సీఎం అభ్యర్థిగా హీరో విజయ్

UP Minor Girl: ఫాలోవర్స్ పెంచుకునేందుకు హిందూ దేవుళ్లపై చీప్ కామెంట్స్, టీనేజర్ తోపాటు పేరెంట్స్ అరెస్ట్!

Big Stories

×