Chamala Kiran: బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ పై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాలపై ఈయనకు కనీస అవగాహన కూడా లేదని విమర్షించారు. నితిన్ నబీన్ బీహార్ మైండ్సెట్తో తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని ఓ సారీ ఇది బెంగాల్ తరహలో చేస్తాం లేదా ఉత్తరప్రదేశ్ లా చేస్తాం అంటున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు.
Also Read: Illegal Bakery: గడువు ముగిసి కుళ్లిన పదార్ధాలతో బేకరీ దందా.. ఇద్దరు అరెస్ట్..!
తెలంగాణను గత పాలకులు ఏటీఎంలా వాడుకున్నారని విమర్శిస్తున్న బీజేపీ, 2014 నుండి 2023 వరకు కేంద్రంలో అధికారంలో ఉండి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని ఎందుకు ఆపలేకపోయిందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోక పోవడమే కాకుండా వారిని కాపాడుతుంది మీరే కదా అని ఫైర్ అయ్యారు. గతంలో నితీన్ నబీన్ బీజేపీ అద్యక్ష పదవిలో లేవచ్చేమో కాని గతంలో ఉన్నటువంటటి జేపీ నడ్డాకు కాళేశ్వరం గురించి మోత్తం తెలుసని అన్నారు. అప్పుడున్న జేపీ నడ్డా ఎమి చేయలేదని, ప్రస్థుతం నేను బీజేపీ పార్టీని దిశానిర్థేశం చేస్తున్నారని చెప్పడానికి వస్తున్నారా అని ఎద్దేవ వేశారు.
నితిన్ నబీన్కు తెలంగాణపై అవగాహన లేదు: ఎంపీ చామల
బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్కు తెలంగాణ రాజకీయాలపై కనీస అవగాహన లేదని, బీహార్ మైండ్సెట్తో మాట్లాడుతున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణను గత పాలకులు ఏటీఎంలా వాడుకున్నారని విమర్శిస్తున్న… pic.twitter.com/HnB9zCUwuY
— BIG TV Breaking News (@bigtvtelugu) June 29, 2026
Also Read: వాన ఎఫెక్ట్.. సీఎం రేవంత్ ‘మధిర’ సభ రద్దు.. వేదిక ఎక్కడో తెలుసా?