E-Paper
Advertisement

Restaurant Service charges: కస్టమర్ల వద్ద సర్వీస్‌ ఛార్జీలు వసూలు చేసే రెస్టారంట్లపై చర్యలు.. ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

Restaurant Service charges: కస్టమర్ల వద్ద సర్వీస్‌ ఛార్జీలు వసూలు చేసే రెస్టారంట్లపై చర్యలు.. ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
Advertisement

Restaurant Service charges| హోటళ్లు, రెస్టారెంట్లు ఆహార బిల్లులలో సర్వీస్ ఛార్జీలను (Service charge) కలిపి వసూలు చేస్తుండడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సర్వీస్‌ ఛార్జీలను వినియోగదారులు కచ్చితంగా చెల్లించేలా బిల్లులో వాటిని కలిపి ఇవ్వడం వారి హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. రకరకాల పేర్లతో ఛార్జీలు వసూలు చేయడం అన్యాయమైన వ్యాపార విధానాలతో సమానమని కోర్టుమండిపడింది. సర్వీస్‌ ఛార్జీలు చెల్లించాలా.. వద్దా..? అనే విషయాన్ని కస్టమర్ల విచక్షణకే వదిలేయాలని సూచించింది.

ఈ విధంగా వినియోగదారులపై అదనపు ఛార్జీలను విధించే రెస్టారంట్లపై తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థకు సూచించింది. హోటళ్లు బిల్లులలో సర్వీస్‌ ఛార్జీలు వసూలు చేయడాన్ని నిషేధిస్తూ వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ (CCPA) గతంలో చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ పలు రెస్టారంట్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది.

Advertisement

Also Read: భార్య‌కు ప్రియుడితో పెళ్లి చేసిన భ‌ర్త‌, అసలేం జరిగిందంటే..

పిటిషన్ దాఖలు చేసిన రెస్టారెంట్ల సంఘం

Advertisement

జీఎస్టీ తరహాలో ఆహార బిల్లులో సర్వీస్ ఛార్జీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FHRAI) పిటిషన్ దాఖలు చేసింది. అయితే వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించిన కారణంగా రెస్టారెంట్లు ఆహార బిల్లులో సర్వీస్ ఛార్జీని తప్పనిసరి చేయరాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఫుడ్ బిల్లుపై సర్వీస్ ఛార్జీ విధించవద్దని రెస్టారెంట్లకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) జారీ చేసిన మార్గదర్శకాల చెల్లుబాటును ఢిల్లీ హైకోర్టు తన నిర్ణయంలో సమర్థించింది.

రెస్టారెంట్ అసోసియేషన్‌కు హైకోర్టు జరిమానా:

కోర్టు మార్గదర్శకాలను సవాలు చేసినందుకు ఢిల్లీ హైకోర్టు రెస్టారెంట్ అసోసియేషన్‌కు లక్ష రూపాయల జరిమానా విధించింది. జూలై 4, 2022న సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) జారీ చేసిన మార్గదర్శకాలను అదే నెల చివరిలో హైకోర్టు నిలిపివేసింది.

కేంద్ర ప్రభుత్వం వాదన ఏంటి?

కొన్ని రకాల హోటళ్లు, రెస్టారెంట్లలో వసూలు చేస్తున్న సర్వీస్‌ ఛార్జీలు.. పన్నుల కిందికి రావని కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రకటించింది. వీటిని సేవా పన్నుగా పరిగణించడం పొరపాటేనని తెలిపింది. వాటి చెల్లింపులను వినియోగదారుడి అంగీకారానికే వదిలేస్తున్నట్లు అన్ని హోటళ్లలో బోర్డు ప్రదర్శించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శకాల ప్రకారం బిల్లులో సేవా రుసుము కాలమ్‌ను ఖాళీగా వదిలేయాలి. అయినప్పటికీ హోటళ్లు కస్టమర్లపై ఇష్టారాజ్యంగా సర్వీస్‌ ఛార్జీలు విధిస్తున్నాయి.

సర్వీస్ ఛార్జ్ డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయండి:

మీ నుంచి లేదా మీ పరిచయస్తుల నుంచి ఒక రెస్టారెంట్ యజమాని బలవంతంగా సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తే.. మీరు దాని గురించి వినియోగదారుల కోర్టు, ఆహార వినియోగదారుల అథారిటీలో ఫిర్యాదు చేయవచ్చు. ఇక్కడ ఫిర్యాదు నమోదైతే ఆ రెస్టారెంట్ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

Related News

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×